ఇటీవలే భారత క్రికెట్ అభిమానులందరికీ కూడా ఊహించని షాక్ తగిలింది అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు భారత క్రికెట్ లో అద్భుతమైన ఆటగాడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సురేష్ రైనా షాకింగ్ నిర్ణయం తో అభిమానులను నిరాశకు గురి చేశాడు. గతం లోనే మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన సమయం లో రైనా కూడా అనూహ్య మైన నిర్ణయం తీసుకున్నాడు. నా స్నేహితుడు తోనే నా ప్రయాణం కూడా ముగుస్తుంది అంటూ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు.


 అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడుతూ వచ్చాడు సురేష్ రైనా. సురేష్ రైనా ఆటను కనీసం ఐపీఎల్లో అయినా వీక్షించ గలుగుతున్నాము అని అభిమానులు సంతోషపడ్డారు. అయితే ఇప్పుడు సురేష్ రైనా పూర్తిగా క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చాడు. ఈక్రమం లోనే తనకి కెరియర్లో అండగా నిలిచిన బిసిసిఐకి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానికి ధన్య వాదాలు అంటూ తెలిపాడు.


 ఇక సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యం లో అతని తో ఉన్న అనుబంధాన్ని ఎంతో మంది మాజీ క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమం  లోనే ఇదే విషయం పై స్పందించిన టీమిండియా మాజీ స్పిన్నర్ అమిత్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోతున్నాయి. ప్రతి క్రికెట్ అభిమాని కూడా నువ్వు ఆడిన నాక్స్ తప్పకుండా గుర్తుంచుకుంటారు.. టీమిండియా లో నువ్వు ఉండడం గొప్ప ఆస్తి. రిటైర్మెంట్ జీవితాన్ని హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాను.. క్రికెట్ టైం లో రైనా హైనా అని చెప్పడానికి చాలా క్షణాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.. చీర్స్ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు అమిత్ మిశ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి: