టీమిండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రవీంద్ర జడేజా కొంతకాలం నుంచి బిజెపి పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.  రవీంద్ర జడేజా భార్య గుజరాత్ ఎన్నికల్లో భాగంగా జాంనగర్ నార్త్ నియోజకవర్గం నుంచి బిజెపి తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఇక తన భార్య ఎన్నికల్లో పోటీ చేయగా..  రవీంద్ర జడేజా స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగి తన భార్యకు మద్దతు ప్రకటించారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రవీంద్ర ఏకంగా తన భార్యపై ప్రశంసలు కురిపించి చివరికి ఇరకాటంలో పడి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.


 ఇటీవలే జరిగిన ఒక కార్యక్రమంలో రవీంద్ర జడేజా భార్య ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడింది. ఈ క్రమంలోనే  తన అభిప్రాయాలను పంచుకుంది. అయితే ఇక రవీంద్ర జడేజా  తన భార్య రివాబా జడేజా మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆర్ఎస్ఎస్ గురించి నీకున్న పరిజ్ఞానం చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది. భారత సంప్రదాయాలు సమాజంలోని విలువలను నిలబెట్టే ఆదర్శాలను ప్రోత్సహించే సంస్థ అది. కృషి నైపుణ్యాలతో ఇలాగే ముందుకు వెళ్ళు అంటూ తన సతీమణిపై ఇక ప్రతి భర్త పొగడ్తల వర్షం కురిపించినట్లుగానే రవీంద్ర జడేజా కూడా ప్రశంసలు కురిపించాడు.


 అయితే రవీంద్ర జడేజా ఇలా తన భార్యను పొగుడుతూ సోషల్ మీడియా లో పోస్టులు పెట్టడమే ప్రస్తుతం అతన్ని ఇరకాటంలో పడేసింది. ఎంతోమంది కాంగ్రెస్ శ్రేణులు రవీంద్ర జడేజా వ్యాఖ్యలపై స్పందిస్తూ విమర్శనాస్త్రాలు సందిస్తూ ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దర్యాప్తు సంస్థల భయంతో నటులు క్రీడాకారులు ఇలా ప్రతి ఒక్కరు కూడా భాజాపాను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. బీసీసీఐ సెక్రటరీగా అమిత్ షా కొడుకు జై షా నియమితులు అయిన తర్వాత ఇక క్రీడ రంగం మొత్తం  బీజేపీ వశం అయిపోయింది అంటూ విమర్శలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: