టీం ఇండియా తరపున అంతర్జాతీయ స్థాయి ప్రదర్శన కొరకు ఎప్పటినునో వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న రాహుల్ త్రిపాఠికి ఈ సారి కూడా ఊహించినట్టే నిరాశే మిగిలింది. విషయం ఏమంటే, శ్రీలంకతో t20 సిరీస్ కు త్రిపాఠి ఎంపికైన విషయం అందరికీ విదితమే. అయినా అతగాడికి తొలి t20 తుది జట్టులో మాత్రం చోటు దక్కకపోవడం దురదృష్టకరం అని చెప్పుకోవాలి. త్రిపాఠి ఐర్లాండ్ సిరీస్ నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్ లో మాత్రం చోటు దక్కడం పోవడం కొసమెరుపు.

అయితే ఈసారి సీనియర్ ఆటగాళ్లు కూడా దూరం కావడంతో కనీసం లంకతో జరుగుతున్న సిరీస్ లో అయినా చోటు దక్కుతుంది అని అభిమానులు ఆశపడ్డారు. కాగా వారి ఆశలు అడియాశలు అయ్యాయి. అవును, మరోసారి త్రిపాఠి బెంచ్ కి పరిమితం కావడంతో జట్టు మేనేజెమెంట్ పై అభిమానులు తీవ్ర స్థాయిలో సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో చోటు ఇవ్వనప్పుడు ఎందుకు ఎంపిక చేసి ఆశపెట్టాలని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా వారి మనోభావాలను ప్రశ్నల రూపంలో కురిపిస్తున్నారు. "కేవలం డ్రింక్స్ అందించడానికేనా త్రిపాఠిని సెలక్ట్ చేశారు!" అంటూ ఓ అభిమాని పోస్ట్ చేయగా.... "త్రిపాఠిని ఆఫీస్ బాయ్ ని చేసారు కదరా దుర్మార్గుల్లారా?" అని ఒకింత కఠినంగా మరో యూజర్ కామెంట్ చేసాడు. మరి కొంత మంది అయితే కావాలనే జట్టు మేనేజ్మెంట్ ఇలా చేస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా IPLతో పాటు దేశీవాళీ క్రికెట్ కి కూడా మంచి రికార్డు ఉంది. IPLలో సన్ రైజర్స్ జట్టులో కీలక ఆటగాడిగా త్రిపాఠి ఉన్నాడనే విషయం అందరికీ తెలిసినదే. అలాగే ప్రతీ సీజన్లో కూడా ఇతను మెరుగ్గా రాణిస్తున్నాడు కూడా. అలాంటి త్రిపాఠి పట్ల చూపిస్తున్న వైఖరిని అభిమానులు ఎండగడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: