ఈ క్రమంలోనే ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై మాత్రం ప్రస్తుతం ఆసక్తి నెలకొంది అని చెప్పాలి. అయితే గత ఏడాది మొదటిసారి ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ ఎంతలా సత్తా చాటిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన ఆ టీం మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ఐపీఎల్ లో ఛాంపియన్ జట్టుగా అవతరించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ఛాంపియన్ జట్లను సైతం ఓడించి టైటిల్ గెలుచుకుని తమ ప్రదర్శనతో అందరినీ ఫిదా చేసేసింది. ఇక ఈసారి కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది అని చెప్పాలి.
ఇలాంటి సమయంలో పలువురు ఆటగాళ్లు గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరం అవుతుండడం జరుగుతుంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఇప్పుడు ఇలాంటి ఎదురు దెబ్బ తగిలింది. జట్టులో కీలక బౌలర్గా కొనసాగుతున్న జోష్ లిటిల్ మోకాలికి గాయం అయింది. కాగా గుజరాత్ టైటాన్స్ అతన్ని ఏకంగా 4.4 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేసింది. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ తరఫున ఆడుతున్నాడు జోష్ లిటిల్. ఇక గాయం కారణంగా పాకిస్తాన్ సూపర్ లీక్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. అతను కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తే అటు ఐపీఎల్ గుజరాత్ టైటాన్స్ కి కూడా అతను అందుబాటులో ఉండడం కష్టమే అన్నది తెలుస్తుంది.