ఇటీవల రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయంపై అటు ముందుగానే ఎవరు ఒక అంచనా వేయలేకపోయారు అని చెప్పాలి. ఎందుకంటే అటు ముంబై ఇండియన్స్ ఐదు సార్లు ఛాంపియన్గా నిలిచిన జట్టుగా ఉంటే.. అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్లతో ఎంతో పటిష్టంగా ఉంది. దీంతో ఎవరు గెలుస్తారో అనేది ఒక అంచనా రాలేకపోయారు విశ్లేషకులు. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు జట్టు అటు అన్ని విభాగాల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకుంది అని చెప్పాలి.
ఇక ఈ మ్యాచ్ లో అటు విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేసి జట్టు విషయంలో కీలక పాత్ర వహించాడు. ఏకంగా 74 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ గా కింగ్ కోహ్లీ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. బెంగళూరు జట్టు ఓపెనర్ గా 3000 పరుగులు పూర్తి చేశాడు అని చెప్పాలి. ముంబైతో జరిగిన మ్యాచ్లో బాగా రాణించడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. మొత్తం 224 ఐపీఎల్ మ్యాచ్లలో విరాట్ కోహ్లీ 6706 పరుగుల చేయగా.. ఇందులో 45 హాఫ్ సెంచరీలు, ఐదు సెంచరీలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా మొదటి మ్యాచ్ లోనే ఘన విజయాన్ని సాధించి బోనీ కొట్టిన బెంగళూరు జట్టు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని సంపాదించుకుంది.