ఇటీవల కాలంలో ఐపీఎల్ ద్వారా ఒక్కసారిగా తమ ప్రతిభను చాటుకుని స్టార్లుగా ఎదుగుతున్న క్రికెటర్లు చాలామంది ఉన్నారు. అయితే కొంతమంది కేవలం మొదట్లోనే మెరుపులు మెరిపించి ఆ తర్వాత మాత్రం కనిపించకుండా పోతున్నారు అని చెప్పాలి. అలాంటి వారిలో పృద్విషా కూడా ఒకరు అని చెప్పాలి. అతన్ని ఆట తీరు చూసిన తర్వాత అతను భారత క్రికెట్లో ఫ్యూచర్ సచిన్ టెండుల్కర్ అవుతాడని ఎంతోమంది భావించారు. కానీ ఇప్పుడు మరో ఉన్మత్ చంద్ లా కనిపిస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు అని చెప్పాలి.



 టీమిండియాలో చోటు దక్కించుకోవడం గురించి దేవుడు ఎరుగు.. కనీసం ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో అయిన అతనికి చోటు దక్కుతుందా లేదా అన్నది మాత్రం కూడా అనుమానంగా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే 23 ఐపీఎల్ సీజన్లో పృథ్వి షా వైఫల్యం కొనసాగుతూనే ఉంది. వరుసగా నాలుగు మ్యాచ్లలో కూడా ఓపెనర్ గా బరిలోకి దిగి విఫలం అవుతూనే ఉన్నాడు పృథ్వి షా. ఇటీవలే ముంబై తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఫోర్లు కొట్టి టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన.. ఇక 15 పరుగుల వద్ద చివరికి భారీ షాట్ అనే ప్రయత్నంలో వికెట్ పారేసుకున్నాడు.



 గత ఏడు ఇన్నింగ్స్ లలో పృథ్వి అత్యధిక స్కోరు 24 మాత్రమే. యావరేజ్ 10 కంటే ఎక్కువ లేదు. సచిన్ ను మరిపించే ప్లేయర్ అవుతాడని అందరూ ఊహిస్తే ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి విఫలమౌతూ మరో ఉన్ముక్ చంద్  లా కనిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. దీంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పృథ్వి షా ప్రదర్శన గురించే చర్చ జరుగుతుంది అని చెప్పాలి. మొన్నటికి మొన్న సప్న గిల్ పై దాడి చేశాడంటూ పృథ్వి షాపై కేసు నమోదు అయింది. దీంతో ఇక పృథ్వి షా పేలవ  ప్రదర్శన తర్వాత ఆమె నీకు చేతబడి చేసినట్టు ఉంది బ్రో. అందుకే ఇలా ఆడుతున్నావ్ అంటూ కొంతమంది నేటిజన్స్ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl