
కానీ ఊహించని రీతిలో అటు ఐపీఎల్ కారణంగా బీసీసీఐకి ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయ్. ఎందుకంటే ఐపీఎల్ లో నిర్విరామంగా మ్యాచ్లు ఆడుతున్న ఎంతోమంది భారత ప్లేయర్లు గాయం బారిన పడుతున్నారు. దీంతో ఇక బిసిసిఐ ముందుగా ప్రకటించిన డబ్ల్యూటీసి ఫైనల్ జట్టులో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఇటీవల గాయం బారిన పడి ఐపిఎల్ కు దూరమయ్యాడు. ఐపీఎల్ మాత్రమే కాదు డబ్ల్యూటీసి ఫైనల్ కు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది.
దీంతో అతని స్థానంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి. మరి టెస్ట్ జట్టులో వచ్చిన ఛాన్స్ ని ఇషాన్ కిషన్ ఎంత మేరకు ఉపయోగించుకుంటాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇప్పటికే బుమ్రా, శ్రేయస్, రిషబ్ పంత్ లాంటి ప్లేయర్లు గాయం కారణంగా డబ్ల్యూటీసి ఫైనల్ కు దూరమయ్యారు.