భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత ఎనర్జీతో ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంద రెడ్ బుల్స్ ఒకేసారి తాగేసాడేమో అనేంత ఎనర్జీ అతనిలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీనే అటు ప్రత్యర్థులను కూడా భయపెడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక మైదానంలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సహచరులు ఎవరైనా చిన్న తప్పు చేసారు అంటే చాలు అగ్గిమీద గుగ్గిలం  లాగా ఫైర్ అవుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ. అయితే మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఉంటాడో మ్యాచ్ పూర్తయిన తర్వాత మాత్రం అంతే కూల్ గా కనిపిస్తాడు.



 ఇలా విరాట్ కోహ్లీలో ఉండే వేరియేషన్స్ కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇక విరాట్ కోహ్లీ లో ఎనర్జీ మాత్రమే కాదు చమత్కారం కూడా ఎక్కువే. సహచరులను ఎప్పుడు ఆటపట్టిస్తూ ఇక ఫన్నీ పంచులు వేస్తూ ఇక అందరినీ నవ్విస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఇక ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం అనంతరం కూడా విరాట్ కోహ్లీ ఇలా తనలో ఉన్న చమత్కారాన్ని మరోసారి బయట పెట్టాడు. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టు 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది.



 ఇలా ఐపీఎల్లో మూడో అత్యల్ప స్కూలు నమోదు చేసిన జట్టుగా చెత్త రికార్డు మూటగట్టుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అయితే ఈ ఘన విజయం అనంతరం ఆర్సిబి డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్ల మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ తనదైన శైలిలో కామెడీ కామెంట్ చేశాడు. ఈ మ్యాచ్ లో తాను గనుక బౌలింగ్ చేసి ఉంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు కేవలం 40 పరుగులకు ఆల్ అవుట్ అయ్యేది అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో తోటి ఆటగాళ్లందరూ కూడా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: