ఇక రిషబ్ పంత్ పేలవమైన ఫామ్ టీమిండియాకు ఎంతో మైనస్ గా మారిపోతుంది అంటూ ఎంతో మంది మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రిషబ్ పంత్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోయాడు. ఏదో ఒక మ్యాచ్ లో బాగా రాణించినట్లు అనిపించినప్పటికీ అన్ని మ్యాచ్ల్లో మాత్రం అదే జోరును కొనసాగించలేకపోయాడు. దీంతో మిడిలార్డర్లో సరైన పరుగులు రాకపోవడంతో టీమిండియా ఓటమి చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడింది. రిషబ్ పంత్ తన పేలవమైన ఫామ్ తో ఎన్నో విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు.
ఇకపోతే రిషబ్ పంత్ ఆటతీరుపై ఇటీవలే స్పందించిన మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నువ్వు ఖడ్గంతో జీవిస్తే ఖడ్గం తోనే అంతం అవుతావు అంటూ వ్యాఖ్యానించాడు గౌతం గంభీర్. పంత్.. విరాట్ కోహ్లీ లాగా ఎంతో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించే రకం కాదు రిషబ్ పంత్ నూ అలా మార్చేందుకు టీమిండియా యాజమాన్యం ఎంతగానో ప్రయత్నాలు చేస్తుంది. కానీ దానికి చాలా సమయం పడుతుంది. ఇక రిషబ్ పంత్ ప్రస్తుతం ఎలా ఆడుతున్నాడో అలాగే ఆడితే బెటర్ అంటూ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.