టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ పాపులారిటీని క్యాష్ చేసుకుంటూ ఉంటాయి ఎన్నో బ్రాండ్లు. ఈ క్రమంలోనే  తమ కంపెనీల ఉత్పత్తులను ఇక విరాట్ కోహ్లీ చేత ప్రమోషన్స్ చేపించడం లాంటివి చేస్తూ ఉంటాయ్ అనే విషయం తెలిసిందే. ఇలా మిగతా టీమిండియా ఆటగాళ్లు తో పోల్చి చూస్తే అటు విరాట్ కోహ్లీ ఇప్పటివరకు చాలానే వాణిజ్య ప్రకటనల్లో నటించాడు. అంతే కాదు కోట్ల రూపాయలు కూడా వెనకేసుకున్నాడు. అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక యాడ్ విషయంలో ముందుగానే జాగ్రత్త పడ్డాడు అనేది తెలుస్తుంది.


 ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. విరాట్ కోహ్లీ చైనా మొబైల్ కంపెనీ అయిన వివో బ్రాండ్ ప్రమోషన్స్ లో నటించాడు. ఇటీవలే ఇక ఈ కంపెనీ టీవీ లో గాని సామాజిక మాధ్యమాల్లో గాని ప్రకటనలు ప్రసారం చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే ఇది తాత్కాలికమే అన్నది ప్రస్తుతం ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. మనీ లాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు ఎదుర్కొంటుంది వివో కంపెనీ. ఇక ఈ వ్యవహారం తేలేంతవరకూ కూడా అటు కంపెనీ యాడ్స్ ప్రసారం ఆపేయనున్నట్లు  తెలుస్తుంది.


 కాగా 2021లో వివో ఉత్పత్తులను ప్రమోట్ చేసేందుకు విరాట్ కోహ్లీ ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ ఈడీ దర్యాప్తు నేపథ్యంలో కొద్దిరోజులపాటు కనిపించేందుకు అటు విరాట్ కోహ్లీ టీం విముఖత వ్యక్తం చేసిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈడి దర్యాప్తు కొనసాగుతున్న బ్రాండ్ కు ప్రమోషన్ నిర్వహిస్తే విమర్శలు వచ్చే అవకాశం ఉన్నందున ఇక ముందు జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక వివో కంపెనీ తో చేసుకున్న ఒప్పందానికి క్యాన్సల్  చేసుకోవడమే కాదు ప్రకటనల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్నాడు అని  తెలుస్తోంది. కాగా భారత్-చైనా ఘర్షణల నేపథ్యంలో అటు ఐపీఎల్ స్పాన్సర్గా వ్యవహరించిన వివో తప్పుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: