ముఖ్యంగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో టీమిండియా యువ బౌలర్ హర్ష దీప్ సింగ్ కీలకమైన క్యాచ్ జారవిడిచాడు. అయితే ఈ విషయంపై ప్రస్తుతం టీమిండియా అభిమానులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతని వల్లే మ్యాచ్ ఓడిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఇక ఇలాంటి సమయంలో ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ప్రస్తుత క్రికెటర్లు కూడా హర్ష దీప్ సింగ్ కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇలాంటివి సహజమేనని.. అతను ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ క్రికెట్లో ఎదుగుతున్నాడు.. చిన్న తప్పిదానికి అంతలా విమర్శలు అవసరం లేదు అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇలా హర్ష దీప్ సింగ్ కి మద్దతుగా నిలుస్తున్న వారిలో బాక్సర్ విజేందర్ సింగ్ కూడా చేరిపోయాడు అనే చెప్పాలి. పాకిస్థాన్ ఆటగాడు ఆసిఫ్ అలీ ఇచ్చిన క్యాచ్ వదిలేయడం పై సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. సోషల్ మీడియాలో ఎంతో మంది చేస్తున్న విమర్శలను ఉద్దేశిస్తూ కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. వాటిని పట్టించుకోవద్దు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బాక్సర్ విజేందర్ సింగ్. ఏది ఏమైనా ఎవరు ఎంత చెప్పినా అటు హర్ష దీప్ సింగ్ పై విమర్శలు మాత్రం ఎక్కడా సోషల్ మీడియాలో ఆగడం లేదు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి