నటుడు పోసాని కృష్ణమురళి గురించి అందరికి తెలిసిందే. నటుడిగా, దర్శకుడిగా, రచయితగా అయన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. కామెడీ పాత్ర అయినా, సెంటిమెంటల్ పాత్ర అయినా తనదైన స్టైల్ లో చేసి అందరిని అలరిస్తుంటారు. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్తలో పరుచూరి బ్రదర్స్ వద్ద రచయితగా పనిచేసి ఆ తర్వాత మంచి మంచి సినిమాలకు రచయితగా పనిచేసి తనదైన మార్కుతో ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా గుర్తింపు పొందాడు. గోకులంలో సీత, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య లాంటి చాలా హిట్ సినిమాలకు పని చేశారు పోసాని..

అంతేకాదు తనలాంటి ఎంతో మంది రచయితలను పరిచయం చేశారు పోసాని.. ఇప్పటి టాప్ రచయితలు, దర్శకులు అయిన త్రివిక్రమ్, కొరటాల శివ లు అయన దగ్గర శిష్యరికం చేసిన వారే కావడం విశేషం. అయితే తాజగా ఈటీవీ లోఓ ప్రోగ్రాంకి గెస్ట్ గ వచ్చిన పోసానికి అవమానం జరిగిందని ఫీల్ అవుతున్నారు అయన అభిమానులు. ఇటీవలే జాతిరత్నాలు ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఉగాదికి రాబోతున్న ఈ ప్రోగ్రాం లో పోసాని ని హైపర్ ఆది అవమానించాడని ఫైర్ అవుతున్నారు.

జాతిరత్నాలు సినిమాలోని ఓ డైలాగ్ ను పేరడీ చేస్తూ హైపర్ అది "మా దగ్గర టాలెంట్ ఉంది.. మీ దగ్గర అనుభవం ఉంది అని అన్నాడు.. దానికి పోసాని అంటే నా దగ్గర టాలెంట్ లేదన్నా అంటే ఆది మా దగ్గర అనుభవం లేదంటున్నాను సర్ అని కౌంటర్ ఇచ్చాడు.. ఇందులో పోసాని ని అవమానించాడనికి ఏదీ లేకపోయినా తన అభిమాన నటులపై ఈగవాలిన క్షమించరు కొంతమంది అభిమానులు..  దర్శకుడిగా కూడా అయన చాలా సినిమాలకు పనిచేశారు. అయన దర్శకత్వంలో వచ్చిన ఆపరేషన్ దుర్యోధన సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే..  శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా కాగా ఈ సినిమా ఓ రేంజ్ లో హిట్ అయ్యింది. ఈ సినిమా ద్వారా ఆయనకు మంచి అవార్డులు కూడా దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: