సినీ ఇండస్ట్రీలో పోసాని మురళి కృష్ణ అంటే, అంతే స్థాయిలో అందరికీ కామెడీ ఎంతో బాగా గుర్తుంటుంది. ఆయన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఈయన ఏ హీరోతో అయినా నటించగలడు. ఇక ఈయన ఈ మధ్యనే రాజకీయంగా కూడా కొంతమంది నేతలకు సపోర్ట్ ఇచ్చాడు. అయితే పోసాని ఒక యాంకర్ కాళ్ల  మీద పడ్డాడట. ఆయన ఎవరో ఎందుకు పడ్డాడో  తెలుసుకుందాం.


పోసాని గారు ఏదైనా సినిమాలో నటించారంటే , ఖచ్చితంగా సినిమాలో కామెడీ ఉంటుందని ప్రేక్షకులకు బాగా తెలుసు.ఈయన ఒకటో , రెండో సినిమాలలో హీరోగా కూడా నటించాడు. ఇక అసలు విషయానికి వస్తే.. మాటీవీలో ఓంకార్ యాంకర్ గా "సిక్స్త్ సెన్స్" ప్రోగ్రాం కి వ్యవహరిస్తున్నాడు. ఇక సీజన్ 4 ప్రసారమవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది ఈ మధ్యనే ఈ ప్రోగ్రామ్ కు  కొంతమంది స్టార్ ఇమేజ్  ఉన్న వాళ్ళని  ఈ ప్రోగ్రాం కు ఎక్కువగా ఇన్వైట్ చేస్తూ ఉంటారు.


ఇక ఈ ప్రోగ్రాం కు వచ్చేవారం ముఖ్యఅతిథిగా పోసాని కృష్ణ మురళి, శివ శంకర్ మాస్టర్ లు అతిధి లు గా రాబోతున్నారు. ఇందులోనే యాంకర్ రవి, విష్ణు ప్రియా లు కూడా రాబోతున్నారు. ఇక శివ శంకర్ మాస్టర్ కు ఓంకార్ కు మంచి అనుబంధం ఉంది. ఇక ఈ షోలో గేమ్ లో పాటిస్పేట్ చేస్తున్న పోసాని , శివ శంకర్ మాస్టర్లను ఆడుకుంటుండడంతో  పోసాని గారికి టెన్షన్ ఎక్కువై నాకు డబ్బులే వద్దంటూ.. ఓంకార్ కాళ్లపై పడ్డాడు.


ఇక అంతే కాకుండా ఏదైనా నెంబర్ చెప్పమని చెప్పగా వాళ్లు చెప్పిన నెంబర్ ను  ఓపెన్ చేసేకి, 1,2,3 అని  నెంబర్ కౌంట్ చెపుతూ ఓంకార్ స్టాప్ అనడంతో.. పోసాని అక్కడినుంచి వెళ్ళిపోతాను అంటూ ప్యాంటు తీసివేయడం మొదలు పెట్టాడు. దీంతో శివ శంకర్ మాస్టర్ ఇటు రా పోసాని అంటే.. అది నా పేరు కాదు.. నాపేరు పరుచూరి గోపాలకృష్ణ అంటు తిరిగి వచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: