సంవత్సరానికి ఒక్క సారి వచ్చే దసరా,దీపావళి,సంక్రాంతి పండగల వల్ల మార్కెట్లో వున్న ప్రతి కంపెనీ వారు ఎన్నో ఆఫర్స్ ప్రకటిస్తుంటారు.వారు ప్రకటించే ఆఫర్ల కోసం కూడా వినియోగ దారులు ఆశతో ఎదురు చూస్తుంటారు.ఇక దాచుకున్న డబ్బులు ఈ సమయంలో బయటకు తీస్తారు.అంతే కాకుండా,ఇంతవరకు కొత్తవస్తువులు తీసుకోకుండా ఉన్నవారు ఇప్పుడు షాపింగ్స్ చేయడానికి ఆసక్తి కనబరుస్తారు.ఇక వినియోగదారుల ఆసక్తి దృష్ట్యా దసరా,దీపావళి పండగలకు హ్యాపీ మొబైల్స్ ‘మెగా ఫెస్టివల్ ధమాకా’ను ప్రకటించింది.అవేంటంటే ప్రతి మొబైల్ కొనుగోలుపై కచ్చితమైన బహుమతి ఉంటుందని.రూ.5 కోట్ల విలువైన బహుమతులు ఇవ్వనున్నామని చెప్పారు.
బహుమతులతోపాటు హెచ్ డి ఎఫ్ సి కార్డులపై 20 శాతం వరకు,ఐసీఐసీఐ బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డులపై 5 శాతం వరకు క్యాష్ బ్యాక్ చెల్లించనున్నారు.ఆన్లైన్ కంటే తక్కువ ధరలకు హ్యాపీ మొబైల్స్ స్టోర్లలో మొబైల్ ఫోన్లు కొనుగోలు చేయొచ్చని పవన్ వివరించారు.బహుమతుల్లో భాగంగా రూ.9,999 విలువైన మొబైల్ కొనుగోలుపై రూ.8,549 విలువైన మైక్రోమాక్స్ ఎల్ఈడీ టీవీని ఉచితంగా ఇస్తున్నారు. రూ.13,990 వీవో వై95 ఫోన్పై రూ.7,900 క్రాంప్టన్ కూలర్ ఉచితం.రూ.9,999 రెడ్మీ వై2 మొబైల్ కొనుగోలుపై రూ.3,200 ఎవరెడీ టేబుల్ ఫ్యాన్ ఇవ్వనున్నట్లు హ్యాపీ మొబైల్స్ తెలిపింది..
ఒప్పో రెనో 2 కొనుగోలుపై 10 శాతం క్యాష్ బ్యాక్ వంటి అనేక ఆఫర్లు ఉన్నట్లు తెలిపింది. సామ్సంగ్ ఏ6 ప్లస్పై 48 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఐఫోన్ 11 ప్రో కొనుగోలుపై రూ.7,000 వరకూ క్యాష్బ్యాక్ లభిస్తుందని వివరించింది.ఈ ఆఫర్ అక్టోబరు ఒకటి నుంచి 29 వరకూ అమలులో ఉంటుందని హ్యాపీ మొబైల్స్ సీఎండీ కృష్ణపవన్ తెలిపారు.ఇక విశాఖపట్నంలోని డాబా గార్డన్స్లో హ్యాపీ మొబైల్స్ షోరూమ్ను ప్రారంభించిన సందర్భంగా ఫెస్టివల్ ధమాకాను ప్రకటించింది.తెలుగు రాష్ట్రాల్లో హ్యాపీ మొబైల్స్ షోరూమ్లు తాజాగా 57కు చేరాయని,భవిష్యత్తులో 100 నుంచి 150 స్టోర్లను ఏర్పాటు చేయనున్నామని..రూ.400 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకున్నామని హ్యాపీ మొబైల్స్ డైరెక్టర్ కోట సంతోష్ తెలిపారు.ఇక డాబా గార్డన్స్లో హ్యాపీ మొబైల్స్ షోరూమ్ను సినీ నటి కాజల్ అగర్వాల్చే ఓపెనింగ్ చేపించారు...