ప్రముఖ దిగ్గజ కంపెనీ ఒప్పో మొబైల్ ప్రియుల కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది..ఈ కంపెనీ నుంచి తయారు చేసిన నాలుగు ఫోన్లను మార్కెట్ లోకి వదిలింది.. ఆ ఫోన్ల పై ఒకేసారి నాలుగింటి పైన అదురి పోయే ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ ఫోన్లకు గల ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం.. 



ఒప్పో ఎఫ్17, ఒప్పో ఏ15, ఒప్పో ఏ12, ఒప్పో రెనో 3 ప్రో ఫోన్లపై ఈ ధర తగ్గింపు లభించింది. ఈ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్లపై రూ.500 నుంచి రూ.2,000 వరకు ధర తగ్గింపును అందించనుంది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండిట్లో ధర తగ్గింపును అందించారు. రెనో 3 ప్రో స్మార్ట్ ఫోన్ ‌పై అత్యధికంగా రూ.2,000 తగ్గింపును అందించగా, ఒప్పో ఏ15 స్మార్ట్ ఫోన్‌పై రూ.500 తగ్గింపును అందించారు. ఈ నాలుగు ఫోన్లు నాలుగు వెరియంట్లలో ఉన్నాయి. 



ఒప్పో ఎఫ్17 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,990 నుంచి రూ.18,490కి తగ్గింది. తగ్గిన ధర తోనే అమెజాన్ లో అందుబాటులో ఉంది.ఒప్పో ఏ12 ఈ ఫోన్ కూడా ఒప్పో లోని టాప్ ఫోన్లలో ఒకటిగా నిలిచింది.. రూ.9,490 నుంచి రూ.8,990కు తగ్గింది.ఒప్పో రెనో 3 ప్రో ధర కూడా భారీగా తగ్గింది. అయితే ఈ ప్రస్తుతం రేట్ల విషయానికొస్తే..రూ.25,990 నుంచి రూ.24,990కు తగ్గింది..ఈ ఫోన్లు ఇప్పుడు భారీగా తగ్గడం పై జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మార్కెట్ లో ఈ ఫోన్ కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతూ వస్తుంది.. ఇప్పుడు ఈ ఫోన్లను కొనడానికి మొబైల్ ప్రియులు ఎక్కువగా ముందుకు వస్తున్నారు.. దీంతో సేల్స్ కూడా కంపెనీ ఆశించిన దానికన్నా కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: