ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారిపోయిన తర్వాత కూడా కూడా కొంతమంది ఇలా చేయకూడదు అని అనుకోవడం లేదు. ఇలా చేస్తే మరింత పాపులారిటీ సంపాదించవచ్చు అని భావించి ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా సిద్ధమైతే ఉన్నారు అని చెప్పాలి. ఇలా సెల్ఫీ తీసుకోవాలనే సాహసం చేసి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా నెలరోజుల్లో పెరిగిపోతూనే ఉంది. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. ఏకంగా బోనులో ఉన్న సింహం దగ్గరకు వెళ్లి ఒక అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకోవడానికి ప్రయత్నించింది. కానీ పక్క బోను లో ఉన్న ఎలుగుబంటిని మాత్రం గమనించలేదు.
యువతి సెల్ఫీ తీసుకుంటూ ఉండగా బోనులో ఉన్న మృగరాజు సైలెంట్ గానే ఉంది. కానీ పక్కనే ఉన్న ఎలుగుబంటి మాత్రం ఏకంగా ఆ యువతి టీషర్ట్ ను పట్టుకొని బోను లోకి లాగేందుకు ప్రయత్నించింది. క్షణం ఆలస్యమైన కూడా ఆ ఎలుగుబంటి ఏకంగా ఆ యువతీని గాయపరిచేది అని చెప్పాలి. కానీ అంతలో అప్రమత్తమైన యువతి పక్కకు తప్పుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా మరి ఇంత అతి అవసరమా అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజెన్లు.