గడిచిన రెండు సంవత్సరాల క్రితం కరోనా మహమ్మారి ఒక్కసారిగ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ప్రపంచవ్యాప్తంగా అప్పటినుంచి అనేక సమస్యలు కూడా మొదలవుతూనే ఉన్నాయి. కొన్ని సమస్యలు దీర్ఘకాలంగా ఉన్న ఈ అంటూ వ్యాధి ఇప్పటికే అనేక ప్రాంతాలలో అక్కడక్కడ పాకుతూనే కనిపిస్తోంది. దీంతో సాధారణ వ్యాధులను నివారణకు ఇచ్చి అనేక వ్యాక్సిన్లను సైతం పిల్లలకు అందలేదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పిల్లలకు పోలియో వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు.


సాధారణ చికిత్సని అందిస్తున్న కొన్ని ఆస్పత్రులు తక్కువ అవుతున్న నేపథ్యంలో తీవ్రమైన వ్యాధులతో సతమతమవుతున్నారు. చిన్నారులకు కూడా అందవలసిన వ్యాక్సిన్ అందడం లేదని దీంతో ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా..6.7 కోట్ల మంది చిన్నారులకు పోలియో వంటి తీవ్రమైన అనారోగ్యం వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని..UNICCEF తెలియజేస్తోంది.2019-21 మధ్యలో 67 మిలియన్ల పిల్లలకు సాధారణ మోతాదులో వ్యాక్సిన్ ఇవ్వలేక పోయిందని ఐక్యరాజ్యసమితిలో తెలియజేయడం జరిగింది. అందుచేతని ఎక్కువ మంది చిన్నారులు ఇలా తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశానికి చాలా దగ్గరలో ఉన్నారని తెలియజేస్తోంది.

ముఖ్యంగా పిల్లలలో కలరా ,విజల్స్, పోలియో వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలుపుతోంది. అందుచేతనే పిల్లలకు త్వరలోనే టీకాలు వేయించాలని ఆ ద్వారా తీవ్రమైన వ్యాధులను వ్యతిరేకంగా వారిలో రోగనిరోధక శక్తి ఏర్పరిచేలా చేయాలని యూనిసెఫ్ తెలుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు సాధారణ వ్యాక్సిన్లు ఇవ్వబడ్డాయి.. టీక ఇవ్వలేక పోయిన పిల్లల సంఖ్య  కూడా భారీ సంఖ్యలోనే ఉందని తెలియజేస్తోంది ప్రపంచవ్యాప్తంగా ఐదుగురు పిల్లలలో ఒకరికి మాత్రమే జీరోడోస్.. పాక్షికంగా టీకాలు మాత్రమే వేయపడ్డాయని తెలిపారు. 2008వ సంవత్సరం తర్వాత ఇంత భారీ సంఖ్యలో పిల్లలకు టీకాలు వేయకపోవడం ఇదే మొదటి సారి అని ఆ సంస్థ వెల్లడిస్తోంది. ఇండియాలో 27 లక్షల మంది పిల్లలకు కరోనా మహమ్మారి రావడానికి ముందు 13 లక్షల మందికి మాత్రమే వేసినట్లుగా గుర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: