ఇక ఓలా కంపెనీ కొత్త ప్రొడక్ట్‌ల అప్‌డేట్‌లను వినియోగదారులకు అందిస్తోంది. ఓలా ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన ఎటర్గో స్కూటర్ కంపెనీని కొనుగోలు చేసినప్పటి నుంచి కొత్త ప్రొడక్ట్స్‌ తయారీపై ఫుల్ గా దృష్టి సారించింది.ఇక ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీని 2020 డిసెంబర్‌లో తమిళనాడులో ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం ఒకటిన్నర సంవత్సరాలలో,ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ ఎలా ఉండాలో రీడిఫైండ్‌ చేసింది. తాజాగా భారతీయ వినియోగదారుల కోసం కొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును కూడా తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఓలా కంపెనీ ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన వివరాలను ఓలా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇంకా అలాగే S1 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు సక్సెసర్‌గా రాబోయే MoveOS 3 అప్‌డేట్ గురించి కూడా అగర్వాల్ వివరించారు.భవిష్ అగర్వాల్ చేసిన పోస్ట్ లో .. 'భారతదేశంలో ఇప్పటివరకు తయారు చేయని స్పోర్ట్స్ కారును మేము తయారు చేయబోతున్నాం.' అని ఆయన రాశారు. రాబోయే అప్‌డేట్ MoveOS 3లో మూడ్స్ ఫీచర్‌ను టెస్ట్ చేసిన ఒక వీడియోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆయన చేసిన మరొక పోస్ట్ లో .. 'ఇక రాబోయే అప్‌డేట్‌ను దీపావళి సందర్భంగా ప్రజల ముందుకు తీసుకొస్తాం. ఈ సంవత్సరం దీపావళి రోజున అందరి కోసం MoveOS 3 అనేది లాంచ్‌ అవుతుంది. MoveOS 2 అనేది అందరికీ కూడా ఎక్సైట్‌మెంట్‌ కలిగించింది, అయితే MoveOS 3ని అనుభవించే వరకు కూడా వేచి ఉండండి' అని పేర్కొన్నారు.


ఇక 2022 మార్చిలో.. ఎలక్ట్రిక్‌ బ్యాటరీ టెక్నాలజీలలో ప్రత్యేకత కలిగిన ఇజ్రాయెల్ ఆధారిత సంస్థ అయిన స్టోర్‌డాట్‌లో ఓలా పెట్టుబడులను పెట్టింది. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా XFC (ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ ఛార్జింగ్) బ్యాటరీ టెక్నాలజీని బాగా అభివృద్ధి చేస్తున్నాయి. ఎక్స్‌యూవీ700, థార్ ఇంకా ఎక్స్‌యూవీ300లను డిజైన్ చేసిన మాజీ మహీంద్రా డిజైనర్ రామ్‌కృపా అనంతన్ ఓలా టీమ్‌లో చేరినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఓలా నుంచి మినిమలిస్ట్ ఇంకా అలాగే టెక్కీ వాహనాన్ని ఆశించవచ్చు. ఇందులో పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఈ బ్యాటరీలు స్వదేశీ పద్ధతిలో కూడా రూపొందిస్తున్నారు.ఇంకా అలాగే మరోవైపు, ఓలా ఖర్చులను తగ్గించుకోవడం కోసం, నిధుల కొరతతో కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా డిపార్ట్‌మెంట్‌ల వారీగా మొత్తం కూడా 500 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందని ఇటీవలి ఓ నివేదిక పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: