కరోనా లాక్ డౌన్ సమయంలో ఇప్పుడు ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దాదాపుగా దేశంలో అన్ని ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు సంచలనంగా మారాయి. తాజాగా ఒక డాక్టర్ తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటు చేసుకుంది.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చూస్తే... మహారాష్ట్ర, నాగ్‌పూర్‌ కు చెందిన వైద్యుడు తన భర్త మరియు ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. భర్త మరియు పిల్లల మృతదేహాలు మంచం మీద కనిపించగా, డాక్టర్ తదుపరి గదిలో ఉరివేసుకున్నట్లు పోలీసులు కనుగొన్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేసామని దర్యాప్తు జరుగుతోందని అక్కడి పోలీసులు మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: