దేశంలో కొద్ది రోజులుగా భూప్రకంపనల సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా మణిపుర్​ తమెంగ్లోంగ్​ జిల్లాలో భూమి కంపించింది. దాదాపు నెలన్నర రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో తీవ్రస్థాయిలో భూకంపం రావడం ప్రజల్లో భయాందోళనలు పెంచుతోంది. నాలుగు రోజులక్రితం ఉఖ్రుల్​ జిల్లాలో భూమి కంపించింది.తమెంగ్లోంగ్​ జిల్లాలో సంభవించిన భూకంపం రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(ఎన్​సీఎస్​) వెల్లడించింది. శనివారం రాత్రి 11.08 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.


ప్రస్తుత ఘటన వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని అధికారులు తెలిపారు.హరియాణాలోని రోహ్​తక్​లో స్వల్ప భూప్రకంపనలు నమోదైనట్లు ఎన్​సీఎస్​ తెలిపింది. రిక్టర్​ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు తెలపింది. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో భూమి కంపించగా.. 8 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: