ఓవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయభేరి మోగించిన ఆనందంలో టి‌ఆర్‌ఎస్ పార్టీ ఉంటే మరో వైపు అదే పార్టీలో ఉన్న ఇద్దరు డిప్యూటీ సీఎంలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వారే మాజీ ఉప ముఖ్యమంత్రులు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య. వీరిద్దరి మధ్య నెలకొన్ని విభేదాలతో స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్ఎస్‌లో వర్గ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

 తాజాగా మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అతను ఒక చేతకాని వాడని, ఒక్క రూపాయి ఎవరికి సహాయం చేయనివాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన కింద పనిచేసే వారిని నిరుత్సాహ పరుచడం కాదని, మగాళ్ళు అయితే ఆర్థిక సహాయం చేయాలంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘పదవులను, పనులను అమ్ముకుని.. సిగ్గులేకుండా మళ్ళి మాట్లాడుతున్నారు’ అంటూ రాజయ్యను ఉద్దేశించి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మరి కడియం శ్రీహరి వ్యాఖ్యలపై తాటికొండ రాజయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి.   .

మరింత సమాచారం తెలుసుకోండి: