నాందేడ్ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదకొండు రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. నాగ్పూర్, పూణేతో పాటు నాందేడ్ జిల్లాలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నాందేడ్ తెలంగాణకు సరిహద్దుల్లో ఉంటుంది. ఆ జిల్లా నుంచి తెలంగాణకు నిత్యం రాకపోకలు ఎక్కువుగా ఉంటాయి. దీంతో అక్కడ కేసుల సంఖ్య పెరిగిపోతుండటంతో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రం నుంచి వచ్చే వారికి కోవిడ్ టెస్ట్ లను నిర్వహిస్తుంది. ఇక్కడ పలు ప్రాంతాల ప్రజలు కూడా ఆందోళనతో ఉన్నారు. ఇక ప్రభుత్వం మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల ప్రజలను అప్రమత్తం చేస్తోంది.