కరోనా సెకండ్ వేవ్ సమయంలో మూతబడ్డ థియేటర్స్ మళ్లీ ఇన్నాళ్లకు తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో లో మొదటి టాలీవుడ్ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయితే అది ఏ స్టార్ హీరో సినిమానో కాకుండా టాలెంటెడ్ యంగ్ హీరోది కావడం విశేషం. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఇంటెన్స్ యాక్షన్ కోర్టు డ్రామా "తిమ్మరసు" జూలై 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రమోషన్ లో భాగంగా ఈ చిత్రం ట్రైలర్ ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేత ఈ రోజు రిలీజ్ చేయించారు. ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. సత్యదేవ్ ఇందులో హీరోగా నటిస్తుండగా ఆయన సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ నటిస్తోంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల స్వరాలు సమకూరుస్తున్నారు. 

తాజాగా "తిమ్మరుసు" అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అందులో ఏఎంబి సినిమాస్, ఏషియన్ సినిమాస్ లాంటి మల్టీప్లెక్స్ లతోపాటు మాదాపూర్లోని హైటెక్ థియేటర్, మియాపూర్ లోని సాయి రంగ థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కరోనా తర్వాత ప్రభుత్వం ఇచ్చిన సడలింపు లతో థియేటర్లను ఓపెన్ చేయడానికి ఎగ్జిబిటర్లు ససేమిరా అన్నారు. మొత్తానికి ప్రభుత్వంతో పలుమార్లు చర్చల అనంతరం థియేటర్ లలో పార్కింగ్ ఫీజ్ కు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో ఎట్టకేలకు థియేటర్లు తిరిగి తెచ్చుకోవడానికి సిద్ధమయ్యాయి. థియేటర్లలో మొదటగా రిలీజ్ అవుతున్న చిత్రం "తిమ్మరుసు". ఈ చిత్రానికి వచ్చే రెస్పాన్స్ తర్వాత మిగతా సినిమాలు కూడా రిలీజ్ కు సిద్ధం అయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: