ప్లాన్ సఫలం కోసం భారీగా నిధులు సమకూర్చింది హిడ్మా అని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మావోయిస్టుల నుండి 500 కేజీల బూస్టర్ ల తో పట్టు 400 జెలిటన్ స్టిక్ లు, భారీగా డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు అని గుర్తించారు. అటవీ అధికారుల పేరుతో వాహనాల్లో పేలుడు సామాగ్రి తరలించారు. తెలంగాణ చత్తీస్గడ్ సరిహద్దులో హిడ్మా, ఇతర అగ్ర నేతలకు ఆయుధాలు తరలించారు అని గుర్తించారు. నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు చేసింది.
ఛార్జీషీటులో ఏ1గా ముత్తు నాగరాజు పేరును ప్రస్తావించింది ఎన్ఐఏ. ఈ ఏడాది ఫిబ్రవరిలో తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో భారీగా పేలుడు పదార్ధాలు, అందుకు సంబంధించిన అనేక పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టుగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లైసెన్స్ ఉన్న వారి నుంచి జిలిటెన్ స్టిక్స్, కేబుల్స్, ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, నాన్ ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఫ్యూజు వైర్లు కొనుగోలు చేసారు అని గుర్తించారు. మావోయిస్టు నేత హిడ్మ వద్దకు చేరవేసే క్రమంలో తెలంగాణ, ఛత్తీస్ఘడ్ సరిహద్దుల్లో పోలీసులకు పలువురు వ్యక్తులు చిక్కారు. ఇక దీనికి సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నామని తెలిపారు అధికారులు.