కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి అంకం ప్రారంభమైంది. ఇవాళ ఉత్తర్‌ప్రదేశ్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. యూపీలో మొత్తం  403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం తొలివిడతలో 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్‌లోని 11 జిల్లాల్లో ఉన్న 58 స్థానాల్లో తొలి దశలో  పోలింగ్‌ జరుగుతోంది.


ఈ 58 నియోజకవర్గాల నుంచి 623 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. యూపీలో తొలి విడత పోలింగ్‌లో 9 మంది మంత్రులు బరిలో ఉన్నారు. తొలి విడతలో మొత్తం 2.27 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. మెుత్తం ఏడు దశల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తొలిదశ పోలింగ్‌లో జాట్‌ వర్గానిది కీలకపాత్ర కానుంది. పశ్చిమ ఉత్తర్‌ ప్రదేశ్‌లో అధికంగా జాట్లు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: