ప్రైవేటీకరణ, వేలంపాట మధ్య ఉన్న తేడాను సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. సింగరేణిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఆగస్టు10న జరిగిన వేలంపాటలో సత్తుపల్లి కోయలగూడెం మూడో కోల్ బ్లాక్ను ఔరో కోల్ ప్రైవేట్ సంస్థకు అప్పగించిన వాస్తవాన్ని బండి సంజయ్ గమనించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణికి గనులు ఇవ్వకుండా వేలం వేయడంలో దాగి ఉన్న మర్మం ఏంటో స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోల్బ్లాక్స్ లేకుండా సింగరేణి ఏం చేయాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు.
ప్రైవేటీకరణ, వేలంపాట మధ్య ఉన్న తేడాను సంజయ్ తెలుసుకోవాలని వినోద్ కుమార్ సూచించారు. సింగరేణిని నిర్వీర్యం చేయడంలో భాగంగానే ఆగస్టు10న జరిగిన వేలంపాటలో సత్తుపల్లి కోయలగూడెం మూడో కోల్ బ్లాక్ను ఔరో కోల్ ప్రైవేట్ సంస్థకు అప్పగించిన వాస్తవాన్ని బండి సంజయ్ గమనించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. సింగరేణికి గనులు ఇవ్వకుండా వేలం వేయడంలో దాగి ఉన్న మర్మం ఏంటో స్పష్టంచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కోల్బ్లాక్స్ లేకుండా సింగరేణి ఏం చేయాలని వినోద్ కుమార్ ప్రశ్నించారు. సింగరేణిలో పనిచేస్తున్న దాదాపు 50 వేల మంది కార్మికులు, ఉద్యోగులను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు.