ఇక రాబోయే రోజుల్లో దేశంలో ఎస్‌యూవీ కార్ల ధరలు పెరిగే అవకాశం ఉంది. శనివారం నాడు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఎస్‌యూవీలపై స్పష్టత అనేది వచ్చింది. ఇక పరిహారం సెస్ 22 శాతం ఎక్కువ రేటుతో విధించనున్నట్లు కౌన్సిల్‌ తెలిపింది.48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తరువాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. నాలుగు షరతులకు అనుగుణంగా ఉండే మోటారు వాహనాలపై మొత్తం 22 శాతం అధిక రేటుతో పరిహారం సెస్ విధించనున్నట్లు తెలిపారు. ఈ కార్ల ఇంజన్ సామర్థ్యం 1,500సీసీ కంటే ఎక్కువగా ఉండాలని ఆమె తెలిపారు.ఇంకా ఇది కాకుండా పొడవు 4,000 మిమీ కంటే ఎక్కువ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ ఎక్కువగా ఉండాలని ఆమె తెలిపారు.ఇంకా అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఇంకా జీఎస్టీ కౌన్సిల్ ద్వారా ఎస్‌యూవీ నిర్ణయాన్ని స్వాగతించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖతో తాను జరిపిన చర్చల ప్రకారమే ఈ విషయాన్ని తెలియజేశారని ఆమె తెలిపారు.


ఈ నాలుగు షరతులను నెరవేర్చే వాహనాలపై మొత్తం 28 శాతం జీఎస్టీపై 22 శాతం పరిహారం సెస్ కూడా వర్తిస్తుందని ఈ నిర్ణయం స్పష్టం చేసిందని  ఒక ప్రకటన  వచ్చింది.ఇంకా ఈ సమావేశంలో మొత్తం 15 అంశాలపై చర్చ జరగాల్సి ఉండగా అందులో కేవలం 8 అంశాలపైనే చర్చ జరిపింది. అయితే ఆన్‌లైన్‌ క్రీడలపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల టీం తన నివేదికలో సిఫార్సు చేసింది. అయితే ఈ సమావేశంలో చర్చించి ఓ నిర్ణయాన్ని తీసుకుంటారని అందరు భావించినా కూడా చివరికు ఎలాంటి చర్చ జరపకుండా వాయిదా వేసింది కౌన్సిల్‌. అలాగే ఇథనాల్‌పై 18 నుంచి 5 శాతానికి జీఎస్టీని తగ్గించడం జరిగింది. ఇక జీఎస్టీని ఎగ్గొట్టే సంస్థలకు భారీగా జరిమానా విధించాలని కూడా కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంకా అలాగే పప్పుల పొట్టుపై ఉన్న 5శాతం జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

GST