టాటా గ్రూప్ కి చెందిన  విస్తారా ప్రయాణికుల కోసం అదిరిపోయే ఆఫర్స్ ప్రకటించింది. శనివారం నాడు ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా దేశీయ ఇంకా అలాగే అంతర్జాతీయ ప్రయాణలపై భారీగా ఆఫర్స్ ని ప్రకటించింది.ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఛార్జీలను కూడా విడుదల చేసింది. 'ఈ రోజుతో ఎనిమిదేళ్లు అవుతోంది. ఈ 8 సంవత్సరాల ప్రయాణంలో మున్ముందుకు దూసుకుపోతున్నాం. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో కూడిన ఛార్జీలను ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. విస్తారాలో దేశీయ ఇంకా అంతర్జాతీయ ప్రయాణాలు చేసి ప్రత్యేక ఛార్జీలను ఆస్వాదించండి.' అని ఎయిర్‌లైన్ ప్రకటించింది.ఇక డొమెస్టిక్ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్‌ ధర వచ్చేసి రూ. 1899 నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీమియం ఎకానమీ ధర వచ్చేసి రూ. 2,699 ఇంకా బిజినెస్ క్లాస్‌ ధర రూ. 6,999 చొప్పున వన్ వే రూట్‌తో అన్ని ఛార్జీలతో కలిపి ఇవి వర్తిస్తాయి.ఇక ఇంటర్నేషనల్ ప్రయాణాలపై ఎకానమీ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు) వచ్చేసి రూ. 13,299, ప్రీమియం ఎకానమీ(ఢిల్లీ-ఖాట్మండు)కి రూ. 16,799 ఇంకా అలాగే బిజినెస్ క్లాస్(ఢిల్లీ-ఖాట్మండు, ముంబై-ఖాట్మండు) రూ. 43,699 గా ఉంది. 


ఇంకా అలాగే, ఎక్స్‌ట్రా సీట్, అదనపు బ్యాగేజీ కోసం టికెట్ కొనుగోలుపై మొత్తం 23 శాతం తగ్గింపు కూడా అందిస్తోంది. అలాగే విస్తారా ఎయిర్‌లైన్స్ టికెట్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 23 జనవరి, 2023 నుంచి 30 సెప్టెంబర్ 2023 మధ్య ప్రయాణానికి సంబంధించిన టికెట్లను 12 జనవరి 2023న అర్థరాత్రి 23:59 గంటల దాకా టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రయాణికులు ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ www.airvistara.com ను విజిట్ చెయ్యడం ద్వారా, iOS, ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌ల ద్వారా ఇంకా ఎయిర్‌పోర్ట్ టిక్కెట్ ఆఫీసులలో (ATOలు) అలాగే కాల్ సెంటర్ ద్వారా, ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెన్సీలు (OTA) ఇంకా అలాగే ట్రావెల్ ఏజెంట్ల ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: