చాలా మంది ప్రజలు కూడా తమ ఇంటి బడ్జెట్‌ను మెయింటైన్ చేసుకోలేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సవాళ్లతో కూడిన సమయాల్లో భవిష్యత్తు గురించి ఇంకా ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత జీవితం గురించి ఆందోళన చెందడం చాలా సహజం. అయితే అదృష్టవశాత్తూ ద్రవ్యోల్బణాన్ని అధిగమించడంలో సహాయపడే చాలా రకాల పరిష్కారాలు మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో వీరు స్వల్ప పెట్టుబడులు పెట్టడం వల్ల కొన్ని సంవత్సరాలలోనే మీరు ఈజీగా మిలీనియర్ గా మారవచ్చు. ఇక వాటిల్లో బెస్ట్ పథకం నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్పీఎస్). దీనిని కేంద్ర ప్రభుత్వం 2004 జనవరి ఒకటవ తేదీన ప్రారంభించింది. ఇక ఇది పదవీవిరమణ పథకం. ఇది మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే అని చెప్పినా ఆ తర్వాత కాలంలో ప్రైవేటు రంగంలో పనిచేసే వారు కూడా దీనిని వినియోగించుకొనే వెసులుబాటును కల్పించింది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు పన్ను మినహాయింపులు కూడా ఈజీగా పొందవచ్చు. అలాగే మీ పదవీవిరమణ వయసుకొచ్చేసరికి పెద్ద మొత్తంలో మీరు ఫిక్స్డ్ ఆదాయాన్ని కూడా పొందగలుగుతారు.


ఈ నేపథ్యంలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ పథకంలో చేరడానికి 18 ఏళ్లు నిండిన భారతపౌరులు ఎవరైనా కూడా అర్హులే. కనీసం రూ. 500 టైర్ లేదా టైర్ 2 అకౌంట్ ని ప్రారంభించవచ్చు. ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే పదవీవిరమణ తర్వాత జీవితానికి భద్రత ఇవ్వడమే. దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ద్రవ్యోల్బణం కంటే ఎక్కువ డబ్బుని ఈజీగా రాబట్టవచ్చు.సపోజ్ మీకు ఇప్పుడు 30 సంవత్సరాలు అయితే 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేస్తారు. మీరు ఇప్పటి నుంచే ప్రతి నెలా రూ. 5,000 చొప్పున ఎన్‌పీఎస్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల పదవీ విరమణ చేసే సమయానికి రూ. ఒక కోటి కంటే ఎక్కువ మొత్తాన్ని మీరు పొందవచ్చు. పెట్టిన పెట్టుబడిపై కనీసం రాబడి 10 శాతం అంచనా వేసినా కూడా నికర పెన్షన్ సంపద మొత్తం రూ. 1.11 కోట్లు ఉంటుంది. అంటే మీరు 60 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి మీరు నెలకు రూ. 27,996 పెన్షన్‌ను సులభంగా పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

NPS