ఈ రోజుల్లో యూపీఐ సేవలు బాగా పెరిగిపోయాయి.భారత ప్రభుత్వం కూడా ఆన్‌లైన్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాజాగా ఆర్‌బీఐ రెండు వేల రూపాయల నోటుని కూడా వెనక్కి తీసుకుంది.ఇంకా అలాగే ఎన్‌పీసీఐ రూపొందించిన యూపీఐ సేవలను కూడా మరింత విస్తరించే క్రెడిట్ కార్డుల ద్వారా యూపీఐ సేవలను ప్రారంభించారు. అయితే ఈ సర్వీసెస్ ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులకు మాత్రమే ఉంది. రూపే క్రెడిట్ కార్డులు కస్టమర్‌లకు క్రెడిట్ కార్డ్ జీవిత చక్రం అంతా కూడా డిజిటల్‌గా ఇంటిగ్రేటెడ్ అనుభవాన్ని అందిస్తాయి.అందువల్ల వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్‌ల పెరిగిన సౌలభ్యాన్ని ఆస్వాదించవచ్చు. ప్రస్తుతం రూపే క్రెడిట్ కార్డులను నేరుగా యూపీఐకు లింక్ చేసి పేమెంట్స్ చేయవచ్చు.అయితే ఇది సురక్షితమైన చెల్లింపు లావాదేవీలను నిర్ధారిస్తుంది. ప్రస్తుతం యూపీఐ రూపే క్రెడిట్ కార్డ్‌లను లింక్ చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఇంకా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక కార్డులు అందుబాటులో ఉన్నాయి.


ప్రస్తుతం, వినియోగదారులు తమ రూపే క్రెడిట్ కార్డ్‌లను యూపీఐ బీమ్, మొబిక్విక్ ఇంకా పేటీఎం యాప్‌ల ద్వారా లింక్ చేయవచ్చు. అలాగే యూపీఐ క్రెడిట్ కార్డ్ లింక్‌ను ప్రారంభించడానికి ఇతర అప్లికేషన్‌లు కూడా తమ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లను అప్‌గ్రేడ్ చేస్తున్నాయి.ఫస్ట్ ప్లేస్టోర్ నుంచి బీమ్, ఫోన్ పే, పేటీఎం, మొబిక్విక్ వంటి యూపీఐ యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకుని నమోదు ప్రక్రియను కంప్లీట్ చేయాలి.అలాగే డ్రాప్-డౌన్ లిస్ట్ నుండి మీ బ్యాంక్‌ని మీరు ఎంచుకోవాలి.తరువాత మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన క్రెడిట్ కార్డ్‌ల జాబితా నుంచి మీరు లింక్ చేయాలనుకుంటున్న రూపే క్రెడిట్ కార్డ్‌ని ఎంచుకుని యూపీఐ పిన్ ని మీరు నమోదు చేసుకోవాలి.ప్రస్తుతం యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్‌లను మాత్రమే మీరు లింక్ చేయవచ్చు.అయితే వీసా లేదా మాస్టర్ కార్డ్ క్రెడిట్ కార్డులు లింక్ అవ్వవు.

మరింత సమాచారం తెలుసుకోండి: