తెలుగులో వ‌చ్చిన భ‌ర‌త్ అనేనేను సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ అక్క‌డ నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆ త‌ర్వాత తెలుగులో సూప‌ర్ హిట్ అయిన అర్జున్‌రెడ్డి బాలీవుడ్ రీమేక్ క‌బీర్‌సింగ్ సినిమాలో న‌టించిన కియారా ఆ సినిమాతో దేశ‌వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ విన‌య విధేయ రామ సినిమాలో న‌టించింది. ఇక ఇప్పుడు ఆమె నేష‌న‌ల్ పాపుల‌ర్ హీరోయిన్ కావ‌డంతో ఆమెకు అన్ని భాష‌ల్లోనూ మంచి అవ‌కాశాలు ఉన్నాయి.

 

ఇక ఇప్పుడు ఆమెకు తెలుగులోనే ఏకంగా ముగ్గురు పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయ‌ట‌. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించనున్న భారీ బడ్జెట్ సినిమా, ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ సినిమాలో, అలాగే ప‌ర‌శురామ్ - మ‌హేష్ సినిమాలో సైతం ఆమెనే హీరోయిన్‌గా తీసుకోవాల‌నుకుంటున్నారు. ఈ మూడు సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఆమే కావాల‌ని హీరోలే ప‌ట్టుబ‌డుతున్నార‌టే కియారాతో క‌లిసి ప‌నిచేసేందుకు హీరోలు ఎంత అర్రులు చాస్తున్నారో అర్థ‌మ‌వుతోంది. దీనికి త‌గిన‌ట్టే ఆమె కూడా తాను అడిగిన‌న్ని కోట్లు ఇవ్వాల్సిందే అని చెట్టెక్కేసింద‌ట‌.
 

మరింత సమాచారం తెలుసుకోండి: