కరోనా వైరస్  ప్రభావం దృశ్య  టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అస్తవ్యస్తంగా మారిన విషయం తెలిసిందే. సినిమా షూటింగులు అన్ని నిలిచిపోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ నష్టాల్లో కి వెళ్ళిపోయింది. కాగా నిన్న టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చలు జరిపి సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు... సినిమా థియేటర్లు తెరిచేందుకు  అనుమతులు ఇవ్వాలంటూ కోరిన విషయం తెలిసిందే. 

 

 ఈ విషయంపై పెద్ద వివాదమే జరిగింది. తనను పిలువకుండా మంత్రి తలసాని తో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలకృష్ణ... ఏమైనా భూములు పంచుకుంటున్నారేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం... దీని పై నాగబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని బాలకృష్ణ ను డిమాండ్ చేయటం...ఇవన్ని జరగగా  మరోసారి టాలీవుడ్ లో సమన్వయ లోపం ఉందని బయటపడింది. అయితే తాజాగా మరోసారి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్ ప్రముఖులు భేటీ అయిన విషయం తెలిసిందే . అయితే తాజాగా వీరి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో టాలీవుడ్ ప్రముఖులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కార్మికులకు రెండో విడత సహాయం కొనసాగించటం  తో పాటు బాలయ్య వివాదం  పైన కూడా చర్చించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: