కరోనా కట్టడి విషయంలో ప్రజలకు ఏపీ సర్కార్ అవగాహన కలిగించలేదు అని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన కరోనా నియంత్రణపై ఎక్కడా కూడా దృష్టి పెట్టలేదని అన్నారు. సిఎం నుంచి ఎవరికి కూడా మాస్క్ లు పెట్టుకోవాలి అనే ఆలోచన లేదని అన్నారు.

 

అసలు బాధ్యత కలిగిన ప్రజా ప్రతినిధులు బాధ్యతను విస్మరించిన తీరు బాధాకరమని అన్నారు. అడగడుగునా జగన్ సర్కార్ చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు అసలు అవగాహన కలిగించడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం మాటలకు చేతలకు ఏ మాత్రం కూడా పొంతన లేదని చంద్రబాబు ఈ సందర్భంగా ఆరోపణలు చేసారు. కరోనా దేశ వ్యాప్తంగా పెరుగుతుందని అయినా సరే సర్కార్ పట్టించడం లేదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: