దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక సైనికుల్లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్న అంశం. గత 24 గంటల్లో 43 కొత్త కేసులు బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్ లో నమోదు అయ్యాయి అని బీఎస్ఎఫ్ వివరించింది.
ఈ కేసులతో కలిపి బిఎస్ఎఫ్లో మొత్తం కేసుల సంఖ్య 911 గా ఉందని అధికారులు వెల్లడించారు. మొత్తం 633 మంది బిఎస్ఎఫ్ సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారు అని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) వెల్లడించింది. ఇక ఇతర సైనిక బలగాల్లో కూడా కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సిఆర్పీఎఫ్ లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి.