గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేసారు. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో హైదరాబాద్ పోలీస్ కమీషనర్ విజయం సాధించిన వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. జీహెచ్‌ఎంసి ఎన్నికల ఫలితాల వెలువడనున్న నేపధ్యంలో విజయం సాదించిన పార్టీల నాయకులు, కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ హెచ్చరించారు.

విజయం సాధించామన్న సంతోషంలో రోడ్లపైనా, పబ్లిక్‌ ప్లేస్‌ లలో బాణాసంచా కాల్చడం నిషేధించినట్టు ఆయన స్పష్టం చేసారు. హైదరాబాద్‌ పోలీస్‌ యాక్ట్‌ , సెక్షన్‌-67(సి) ప్రకారం ఆదేశాలను బేఖాతర్‌ చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌, సికింద్రబాద్‌ పరిధిలో ఈ నిషేదాజ్ఞలు 4వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: