ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు.  నెల 7 నుంచి 15 వరకు జరిగే దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. చిన్న చిన్న పనులను రేపు సాయంత్రం కల్లా పూర్తి చేస్తామని, రోజుకు పది వేల మందికి మాత్రమే దర్శనానికి అనుమతినిస్తున్నామన్నారు. 4 వేలు ఉచిత దర్శనం, మూడు వేలు 100 రూపాయలు, 300 మందికి మూడు వందల రూపాయల టిక్కెట్‌ను స్లాట్ రూపంలో  అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల‌ని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న వారు మాత్రమే కొండపైకి రావాలని, థ‌ర్మల్ స్క్రీనింగ్ చెక్ చేసిన తర్వాతే కొండపైకి అనుమతించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఘాట్లలో జల్లు స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుందని, హెలికాఫ్టర్ రైడ్ ఈ సారి దసరాకు ప్రత్యేకత అని వివ‌రించారు. దసరాకు 2500 మంది పోలీస్ సిబ్బందిని నియమించామని, రేపటి నుంచి నాలుగు అంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశామని పోలీసు క‌మిష‌న‌ర్ బ‌త్తిన తెలిపారు. భక్తులు రద్దీని బట్టి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయ‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: