ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహిస్తారు. మూడు రోజుల ప్రచారనికి వచ్చిన మోదీ చివరి రోజు రోడ్ షోతో తన ఎన్నికల ప్రచారాన్ని ముగిస్తారు. మహబూబ్ బాద్ లో 11 గంటలకు నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అనంతరం కరీంనగర్‌లో మధ్యాహ్నాం ఒంటి గంటకు నిర్వహించే సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. కరీంనగర్‌ సభ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత భాగ్యనగరంలో ఆర్టీసి క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వీర సావర్కర్ విగ్రహం వరకు ప్రధాని మోదీ రోడ్ షో చేయనున్నారు.

సాయంత్రం 5 నుంచి 6గంటల వరకు రెండు కిలో మీటర్ల మేర రోడ్ షో ప్రధాని మోదీ జరగనుంది. ప్రధాని రోడ్ షో విజయవంతం కోసం భాజపా రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రోడ్ షో జరిగే మార్గంలో భారీగా పార్టీ శ్రేణులను మోహరించి అడుగడుగునా ప్రధానికి పూలతో స్వాగతం పలికనుంది. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. హుజురాబాద్‌, పెద్దపల్లి, మంచిర్యాల సభల్లో పాల్గొంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: