దేశంలోనే అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అలాంటి ఈ బ్యాంక్ వినియోగదారులకు అతి పెద్ద షాక్ ఇచ్చింది. అంత పెద్ద షాక్ ఏంటి అని అనుకుంటున్నారా? అదేనండి.. బ్యాంక్ ఆన్లైన్ సర్వీసులు ఉపయోగించే వారికీ ముఖ్యమైన అలెర్ట్ ఇచ్చింది. అది ఏంటి అంటే బ్యాంక్ సర్వీసులు జూన్ 21న జరగనున్నాయి.
అయితే ఈ విషయాన్ని ఎస్బిఐ ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. జూన్ 21 ఎస్బీఐ ఆన్లైన్ సర్వీసులు అందుబాటులో ఉండవు ఎస్బిఐ తెలిపింది. దీనికి అనుగుణంగా ట్రాన్సాక్షన్లను ప్లాన్ చేసుకోవాలని కస్టమర్లను కోరింది. కస్టమర్లు ఇటీవల కూడా ఎస్బీఐ ఆన్లైన్ ప్లాట్ఫామ్ సర్వీసులతో ఇబ్బంది పడ్డారు. అందుకనే ఎస్బిఐ ముందుగానే తెలిపింది.
కాగా ''బ్యాంక్ కు సంబంధించిన కొన్ని అప్లికేషన్స్లో కొత్తగా అమలు చేయాలని అందుకే జూన్ 21న ఆన్లైన్ సర్వీసులకు పని చేయకపోవచ్చు అని తెలిపారు. అంతేకాదు కస్టమర్లు దీనికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని కోరుతున్నాం'' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. అయితే జూన్ 13, 14 కూడా ఎస్బీఐ సర్వీసులు కూడా సరిగ్గా పని చెయ్యలేదు. అందుకే ఎస్బిఐ ముందుగానే సమాచారం అందించింది. 22 వ తేదీ యధావిధిగా బ్యాంకు సేవలు పని చేస్తాయి అని తెలిపారు.
Our online services may not be accessible on 21st june as we will be deploying a new environment for some of our applications. We request our customers to plan accordingly to avoid being inconvenienced. #ImportantNotice #SBI pic.twitter.com/nKQBuaZYgt
— State bank of india (@TheOfficialSBI) June 18, 2020