స్టాక్
మార్కెట్ ఇన్వెస్టర్లు అలెర్ట్! ఆలోగా ఈ పనిని పూర్తి చేయండి.ఇక ఈ సంవత్సరం (2022)
మార్చి 31వ తేదీ తర్వాత, తమ పాన్ కార్డ్ను గనుక ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే, కొత్త ట్రేడ్లు లేదా ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ అవుట్ చేయలేరు అని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ తన పెట్టుబడిదారులందరికీ హెచ్చరిస్తూ ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. ఇక పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్కి లింక్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి
మార్చి 31 చివరి తేదీ అని తెలిపింది. పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని 2017 వ సంవత్సరం లో ప్రభుత్వం ప్రకటించింది.అలాగే ఈ కీలకమైన ఇంకా ముఖ్యమైన కసరత్తును నిర్వహించడానికి గడువును ప్రభుత్వం అనేకసార్లు పొడిగించింది. మళ్లీ గడువు పొడిగించే అవకాశం లేకపోలేదు. “సెక్యూరిటీస్ మార్కెట్లో ట్రేడింగ్ ప్రయోజనం కోసం ఆధార్తో సీడ్ చేయని పాన్లు చెల్లవుగా పరిగణించబడతాయి” అని పలు సర్క్యులర్ల ద్వారా తెలియజేసినట్లు ఎన్ఎస్ఇ తెలిపింది. "మార్చి 31, 2022 నాటికి తమ ప్రస్తుత ఇంకా కొత్త క్లయింట్లు ఆధార్ను పాన్తో లింక్ చేయాల్సిన అవసరాన్ని పాటించాలని" సభ్యులందరికీ NSE సూచించింది.
ఆన్లైన్లో పాన్ను ఆధార్కి ఎలా లింక్ చేయాలి?
కీలకమైన ఆర్థిక పనిని పూర్తి చేయడానికి ఈ సులభమైన దశలను అనుసరించండి:
కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్ 2.0కి వెళ్లండి.
'అవర్ సర్వీసెస్' అనే ట్యాబ్పై క్లిక్ చేయండి.
తరువాత 'లింక్ ఆధార్'కి వెళ్లండి.
మీ అన్ని పాన్ నంబర్, ఆధార్ నంబర్ ఇంకా అలాగే మొబైల్ నంబర్ ప్రకారం పేరును పూరించండి "నేను నా ఆధార్ వివరాలను ధృవీకరించడానికి అంగీకరిస్తున్నాను" అనే బాక్స్ ఆప్షన్ ని ఎంచుకోండి.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన 6-అంకెల OTPతో వెరిఫై చెయ్యండి.
కాబట్టి ఇంకా
ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ చెయ్యనివారుంటే ఖచ్చితంగా పైన పేర్కొనబడిన స్టెప్స్ ని అనుసరించి లింక్ చెయ్యండి.