చిన్నచిన్న కారణాలకే ఎంతో విలువైన ప్రాణాలు తీసుకుంటున్నారు మనుషులు. చిన్న సమస్య వస్తే చాలు ఇక అక్కడితో జీవితం అయిపోయింది అని భావిస్తూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు .  ఆ దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని ఆ దేవుడే తీసుకెళ్తాడు అని చెబుతూ ఉంటారు పెద్దలు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం దేవుడిచ్చిన ప్రాణాన్ని చేతులారా తీసుకుంటున్నారు ఎంతో మంది జనాలు. ఇటీవలి కాలంలో బలవన్మరణాలకు పాల్పడుతు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు రోజురోజుకీ వెలుగులోకి వస్తున్నాయి.



 ముఖ్యంగా భార్య భర్తల మధ్య తలెత్తిన కలహాల కారణంగానే జరుగుతున్న ఆత్మహత్యలు ఎక్కువగా అవుతున్నాయి. అయితే కొంతమంది వ్యక్తులు ఏకంగా పరాయి వ్యక్తుల మోజులోపడి అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే చివరికి ఆత్మహత్యలు హత్యలు లాంటివి చేసుకుంటున్నారు. ఇక మరికొంతమంది కాపురం లో తలెత్తిన కలహాలతో మనస్తాపం చెంది ఇక జీవితం వృధా అని భావించి అర్థంతరంగా నిండు నూరేళ్ల జీవితాన్ని తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది  ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న  ఘటన నల్గొండ జిల్లా మునగాల మండలం లో వెలుగులోకి వచ్చింది.



 ముకుందాపురంకి చెందిన వెంకన్న భార్య సరిత అనే 32 ఏళ్ల మహిళ ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుంది.  పొలానికి వెళ్లిన భర్త తిరిగి వచ్చేసరికి మృతి చెందింది. సరిత ఆత్మహత్యకు ముందు ఏకంగా 25 నిమిషాలపాటు ఫోన్ మాట్లాడినట్లు తెలుస్తోంది.అయితే ఇక సరిత ఆత్మహత్య చేసుకోవడానికి వివాహేతర సంబంధమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక సరిత ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు చివరి కాల్ ఎవరికి చేసింది అనే దానిపై ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: