అనుమానం పాత రోగం అంటారు పెద్దవాళ్లు. అలాంటి అనుమానాలే చాలా కుటుంబాలను కళావికలం చేస్తున్నాయి. ఎన్నో జీవితాలను ఆగమాగం చేస్తున్నాయి. అలాంటి ఓ అనుమానమే ఈ భర్తకు ఎదురైంది. ఒక్కసారి అనుమానం మనసులోకి వచ్చిందంటే చివరికి ఏ అనర్థానికి దారితీస్తుందో  తెలియదు. అలాంటి ఓ ఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలై జిల్లాలోని కలస్తంబాడి గ్రామానికి చెందినటువంటి రాజా( 33 ) సంవత్సరాలు. గౌతమి (28 )సంవత్సరాలు.

 వీరికి కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి 9 ఏళ్ళ కొడుకు ఆరేళ్ల వయసు ఉన్న పాప కూడా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా రాజా మద్యానికి బానిసై భార్యను డబ్బులు కావాలని వేధిస్తుండేవాడు. పిల్లలను పట్టించుకోవడం కూడా మానేశాడు. కుటుంబ పోషణ కొరకు అప్పటివరకు ఆటో నడిపినటువంటి ఆయన అది కూడా మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన భార్యను ప్రతిరోజు హింసించేవాడు. ఈ క్రమంలోనే గౌతమి ఈ నెల ఆరవ తేదీ నుండి  కనిపించలేదు. గౌతమీ యొక్క ఆచూకీ  కోసం ఆమె బంధువులు, సన్నిహితులు వెతకని చోటు లేదు. అయినా ఆమె  జాడ దొరకలేదు. మరుసటి రోజు మార్నింగ్ రాజా తల్లి పచ్చయిఅమ్మలు వారి పొలం దగ్గరికి వెళ్ళింది. ఆ పచ్చని చెరుకుతోటలో  గౌతమి మృతదేహం చూసి ఆమె భయంతో పరుగులు తీసింది. గ్రామంలోకి వెళ్లి చెప్పింది. దీంతో చుట్టుపక్కలవారు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని చూసి మంగళం పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  గౌతమి మృతదేహం తీవ్రంగా కాలిపోయి ఉండడంతో తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి  పోస్టుమార్టం కొరకు తరలించారు. వెంటనే భర్త రాజాను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా  నిజాన్ని  ఒప్పుకున్నాడు. తన భార్య ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందని అందుకే ఆమెను కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసి, తర్వాత మృతదేహాన్ని బావి దగ్గరికి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి నిప్పంటించానని తెలిపారు. ఏది ఏమైనా వారి పిల్లలు మాత్రం అనాధలుగా మారిపోయారు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: