ఇటీవల కాలంలో  మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోయింది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పరాయి వ్యక్తుల విషయంలోనే కాదు సొంత వారి విషయంలో కూడా కనీసం జాలి దయ అనేది లేకుండా ప్రవర్తిస్తున్నాడు ప్రతి మనిషి. దీంతో సభ్య సమాజంలో ప్రతి ఒక్కరూ మొత్తం ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతూ బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత కంటే మనస్పర్థలతో ఎన్నో గొడవలు జరుగుతున్న ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయ్. ఈ ఘటనలు ఎన్నో దారుణాలకు కూడా కారణం అవుతున్నాయ్ అనే చెప్పాలి.


 ఇటీవలి కాలంలో ఏకంగా భార్య భర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి గొడవలు ఏకంగా ఆత్మహత్య చేసుకునేంత వరకు దారి తీస్తూ ఉంటే.. కొన్ని కొన్ని సార్లు కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చే వరకు కూడా వెళుతున్నాయి. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవలు ఇక వారి పిల్లల పాలిట శాపంగా మారిపోతున్నాయి. ఏకంగా కోపంతో రక్తం పంచుకుని పుట్టిన పిల్లల విషయంలో కనీసం జాలి దయ చూపించకుండా దారుణంగా హతమార్చుతున్నారు ఎంతో మంది తల్లిదండ్రులు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. తల్లిదండ్రుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ ముక్కుపచ్చలారని పసివాడి ప్రాణం పోవడానికి దారి తీసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తల్లె చిన్నారి బాలుడు పాలిట మృత్యువు లా మారిపోయింది.


 హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్ లో ఈ విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి కొత్తపల్లి గ్రామానికి రమావత్ వెంకటేష్ తో రామవత్ సువర్ణ కు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.  కొంత కాలం పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న వీరి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇటీవల మరోసారి గొడవ పడ్డారు. ఇక ఈ క్రమంలోనే భర్త బయటకు వెళ్లిన సమయంలో కోపంతో ఊగిపోయిన భార్య తనతో పాటు ఏడు నెలల బాలుడు పై శానిటైజర్ పోసి నిప్పంటించుకుంది. ఇక అరుపులు వినిపించడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి మంటలు ఆర్పారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ  7 నెలల బాలుడు ప్రాణాలు వదిలాడు. సువర్ణ కోలుకొని ఇంటికి చేరుకుంది. నాయనమ్మ  ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: