లవర్‌ కోసం ఓ యువతి సంచలన నిర్ణయం ?

విశాఖ లో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది.  ఎన్ఎడి వద్ద డ్రగ్స్ కలిగి ఉన్న యువతి యువకుడు తో పాటు రాజం కు చెందిన మరో డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  దీనిపై వెస్ట్ ఎసిపీ శ్రీ పాదరావు మాట్లాడుతూ..   హైద్రబాద్ కు చెందిన గీత,మాలవ్య,విశాఖ కు చెందిన హేమంత్,రాజాంకు చెందిన డాక్టర్ పృథ్వీ నలుగురు స్నేహితులు  అన్నారు.  వీరంతా గోవాలో డ్రగ్స్ తీసుకుంటు ఉండే వాళ్ళు అని చెప్పారు. ఇటీవల హెమంత్ డగ్స్ కావలని పృథ్వీ అకౌంట్ నుండి 33 వేలు ఫోన్ పే ద్వారా పంపాడన్నారు.  గీత డ్రగ్స్ సప్లయ్ చేస్తుంది..మాలవ్య ఓ కంపెనీలో హెచ్ఆర్ గా పనిచేస్తుందని.. గీత మాలవ్య తో హేమంత్ కు డ్రగ్స్ పంపించిందని వెల్లడించారు.  


29వ తేదిన డ్రగ్స్ తో హైద్రబాద్ నుండి మాలవ్య బయలుదేరి 30 ఉదయం విశాఖ కు వచ్చిందని.. సిటిటాస్క్ పోర్స్ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎన్ఎడి జంక్షన్ వద్ద పోలీసుల మాటు వేసారని స్పష్టం చేశారు.  మాలవ్య ను తీసుకెళ్లేందుకు హేమంత్ ఆడి కారు లో వచ్చాడని.. ఇద్దరు కలిసి కారు ఎక్కిన తరువాత మాలవ్య హేమంత్ కు డ్రగ్స్ ఇస్తుండగా పట్టుకున్నామని వెల్లడించారు.  ఈ కేసులో హేమంత్ ను మాలవ్య  ను డాక్టర్ పృథ్వీ ని అరెస్ట్ చేసామని... గీతను అరెస్టు చేసి విచారణ చేస్తామన్నారు. వీరి వద్ద నుండి 18 ఎంఎండిఏ పిల్స్,2 ఎంఎండిఏ క్లీష్టర్ పౌడర్,ఓ సెల్ పోన్,ఆడినారు,20500 క్యాష్ స్వాదినం చేసుకున్నామని.. వీరందరు హైద్రబాద్ లో పబ్ ల ద్వారా ఒకర్ని ఒకరు పరిచయం అయ్యారని చెప్పారు.  హైద్రబాద్,బెంగళూరు,గోవా,నుండి వీరు డ్రగ్స్ కోనుగోలు చేస్తున్నారని.. ప్రస్తుత విచారణ లో వీరు వినియోగించుకోవడానికే వీటిని తీసుకోచ్ఛినట్లు తెలిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: