ఇటీవలికాలంలో హత్యలు సంబంధించిన వార్తలు ప్రతిరోజు ప్రతి ఒక్కరి చెవిన పడుతూనే ఉన్నాయి. ఇలా తరచూ హత్యలు వెలుగు లోకి వస్తూ ఉండటం చూస్తూ ఉంటే మనుషులు ఎంత గా ఉన్మాదులు గా మారిపోతున్నారు  అన్న విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూనే ఉన్నాయి. ఇకపోతే ఇటీవలే గుంటూరు జిల్లాలో రవికిరణ్ హత్య కేసు ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర విచారణ చేపట్టారు. చివరికి ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి ఇటీవలే కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.


 మాల్పూర్ కు చెందిన రవి కిరణ్ గత 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కంగారు పడిపోయిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే హత్యకు గురై ఉంటాడు అన్న అనుమానాలు కూడా తెరమీదకు రావడంతో మరింత సీరియస్ గా తీసుకుని విచారణ మొదలు పెట్టారు పోలీసులు ఇక పలు ఆధారాలు సేకరించి తెనాలికి చెందిన రౌడీషీటర్ పవన్ కుమార్ ఇక మరికొంతమందిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు.ఈ క్రమంలోనే ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. రవికిరణ్ ప్రియురాలే అతని హత్యకు  కారణం అయింది అని గుర్తించారు పోలీసులు.


 వేమూరు మండలం చదలవాడ కు చెందిన తోట దీప్తి పవన్ కుమార్ ప్రేమించుకుంటున్నారు. అయితే వివాహానికి పెద్దలు అంగీకరించకపోవడంతో ఆమె వేరే వివాహం చేసుకుంది. ఇప్పటికి లడ్డు తో వివాహేతర సంబంధం కొనసాగిస్తూనే ఉంది. అయితే మూడేళ్ల క్రితం దీప్తికి రవి కిరణ్ పరిచయం అయ్యాడు. ఒక అతడితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది.. పవన్ కుమార్ కి తెలిస్తే తన ప్రాణం తీస్తాడు అని భయపడి ఇక రవికిరణ్ ను దూరం పెరుగుతూ వచ్చింది. ఇక  తరచు రవికిరణ్ ప్రియురాలికి ఫోన్ చేస్తూ ఉండడంతో తనను వేధిస్తున్నాడంటూ పాత ప్రియుడు పవన్ కుమార్ కు చెప్పింది. ఈ క్రమంలోనే రవి కిరణ్ ను పిలిపించి కొంత మంది వ్యక్తులు కర్రలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కాలువలో పడేసినట్లు నిందితులు అంగీకరించారు.ఇక ఈ కేసులో ఐదుగురునీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు..

మరింత సమాచారం తెలుసుకోండి: