మొన్నటి వరకు ప్రేమ అంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు కు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ ఇటీవల కాలం లో మాత్రం ప్రేమ అనేది నయ వంచనకు చిరునామాగా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. కాగా నేటి రోజుల్లో ఎంతో మంది ప్రేమ ముసుగు లో మంచి వాళ్ళలా ప్రవర్తిస్తు సమయం సందర్భం కోసం ఎదురు చూస్తూ అవసరాలు తీర్చు కుంటున్నారు. చివరికి శారీరక అవసరాలు తీరి పోయిన తర్వాత ముఖం చాటేస్తున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయ్. వెరసి ఎంతో మంది యువకులు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నేటి రోజుల్లో ఇలాంటి తరహా ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి అని చెప్పడం లో అతిశయోక్తి లేదు.


 అంతే కాదు ఎంతో మంది మోసగాళ్ల చేతిలో అమాయకమైన ఆడపిల్లలు మోస పోతు నడి రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రేమ పేరుతో యువతికి దగ్గరయ్యాడు యువకుడు. ఆ తర్వాత శారీరక వాంఛలు తీర్చుకున్నాడు. చివరికి యువతి గర్భం దాల్చిన సమయం లో అబార్షన్ చేయించాలని భావించాడు. ఈక్రమం లోనే వైద్యం వికటించి యువతి మృతి చెందింది. ఈ ఘటన సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి.


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం లో ఈ ఘటన వెలుగు చూసింది. భూక్యా నందు అనే యువకుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఒక యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. కాగా యువతి గర్భం దాల్చింది. ప్రైవేట్ ఆసుపత్రి లో ఆమెకు అబార్షన్ చేయించేందుకు ప్రయత్నించాడు. అబార్షన్ చేస్తుండగా వైద్యం వికటించి యువతి మృతి చెందింది. విషయం తెలుసుకున్న  యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటన పై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అనంత లోకాలకు వెళ్లి పోవడంతో ఆ త ల్లిదండ్రులు అరణ్య రోదనగా విలపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: