ఇటీవల కాలంలో ప్రేమ మోసానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇద్దరు మనుషుల మధ్య పుడుతున్న  ప్రేమ కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇక అవసరాలు తీర్చుకున్న తర్వాత ఒకరికి ఒకరు అవసరం లేకుండా పోయింది అని చెప్పాలి.  వెరసి ఎంతోమంది ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పిన వారే కూడా చివరికి మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఎంతోమంది అమ్మాయిలు మోసపోతున్నారు. వెరసి తమకు న్యాయం చేయాలి అంటూ న్యాయపోరాటం చేస్తూ పోలీసులను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి.



 ఇక ఇలాంటి ఘటనలు చూసినప్పుడు ఎంతోమంది ఈ మగాళ్లు అందరూ ఇలాంటి వాళ్లే అమ్మాయిల జీవితాలతో ఆటలు ఆడుతూ ఉంటారు అనే తిట్టుకుంటూ ఉంటారు. కాని ఆడపిల్లలు మాత్రమే కాదు మగవాళ్ళు కూడా అమ్మాయిల చేతిలో మోసపోతుంటారు అన్న దానికి నిదర్శనంగా ఇక్కడ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే యువతి మోసం చేసింది అంటూ ప్రియుడు రోడ్డెక్కి న్యాయ పోరాటం చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం మారిపోయింది అని చెప్పాలి. మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది.



 మంచిర్యాల జిల్లాలోని లక్సెట్టిపేట లో  యువతి మోసం చేసింది అంటూ ప్రియుడు ట్విస్ట్ ఇచ్చాడు. తనను ఆరేళ్లుగా ప్రేమించి ఇక ఇప్పుడు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది ఆరోపించాడు. అయితే ఆమెకు డబ్బు నగలు ఎన్నో బిరుదులు కూడా ఇచ్చానని ఆ ఫోటోలను అందరికీ చూపించాడు. ఈ క్రమంలోనే తనకు న్యాయం చేయాలంటూ ఏకంగా ధర్నా చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న పెండ్లికొడుకు తరుపు బంధువులు వెంటనే పెళ్లిని ఆపేశారు. ఈ క్రమంలోనే కల్యాణ మండపంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. అక్కడికి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: