ప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణాలు పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే ప్రేమించుకుంటున్న సమయంలో ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి గొడవలు జరిగినా వారి బంధం మరింత బలపడుతూ ఉంటుంది.. కానీ ఇటీవలి కాలంలో మాత్రం చిన్నపాటి గొడవలతో ఎంతగానో మనస్తాపం చెంది చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. క్షణికావేశంలో కొన్ని అనుకోని తప్పిదాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అని చెప్పాలి.


 ఇలా ప్రేమించే వారి గురించి ఆలోచిస్తూన్న నేటి రోజుల్లో యువత తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి మాత్రం ఎక్కడా ఆలోచించడం లేదు.. ఇటీవలే ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక యువకుడు తన ప్రేయసితో వీడియో కాల్ మాట్లాడుతూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. అయితే అతను కావాలనే ఈ పని చేయలేదు ప్రేయసిని బెదిరించే క్రమంలో అనుకోకుండా నిప్పు అంటుకుంది  కుటుంబ సభ్యులు అప్రమత్తమై మంటలు ఆర్పీనప్పటికీ అప్పటికే 30 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.


 ఈ ఘటన ముంబై లో వెలుగు లోకి వచ్చింది శాంతాక్రజ్ ప్రాంతం లో సాగర్ పరశురామ్  అనే 19 ఏళ్ల యువకుడు వినాయక మండపం ని సందర్శించిన అనంతరం అర్ధరాత్రి సమయం లో తన ప్రేయసి తో గొడవ పడ్డాడు. ఇక చాలా సేపు రోడ్డుపై నిలబడి ఫోన్లో మాట్లాడుతూ గొడవ పడ్డాడు. ఇక ఇంటికి వచ్చి ప్రేయసికి వీడియో కాల్ చేసాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రేయసిని బెదిరించాలని ప్రయత్నించాడు. కానీ ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. దీంతో యువకుడు ఫోన్ వదిలేసి అరవటం  ప్రారంభించాడు. కుటుంబ సభ్యులు అప్రమత్తమై మంటలు ఆర్పారు. 30 శాతం శరీరం కాలి పోయింది. దీంతో ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు
 ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: