భార్య భర్తల బంధం అంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు కేరాఫ్ అడ్రస్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కానీ వెలుగు లోకి వస్తున్న ఘటన చూసిన తర్వాత భార్య భర్తల బంధం అనేది హత్యలకు ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా మారి పోతుంది. అంతేకాదు మోసానికి చిరునామాగా కూడా కొనసాగుతోంది అని తెలుస్తోంది. చిన్న చిన్న కారణాలకే మనస్పర్థల కారణం  గా భార్యా భర్తలు విడిపోతున్న ఘటనలు వెలుగు లోకి వస్తున్నాయి. కష్టసుఖాల్లో తోడు ఉండాల్సిన వారు కట్టుకున్న వారి పైన కక్ష పెంచుకొని దారుణంగా హత్య చేసిన ఘటనలు ఉలిక్కిపడేలా చేస్తున్నాయ్.


 పరాయి వ్యక్తులు మోజులో పడిపోయి కట్టుకున్న వారిని మోసం చేస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. భార్యభర్తల బంధం వివిధ కారణాల ద్వారా ఎన్నో దారుణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతుంది అని చెప్పాలి.  ఇటీవల చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. శాంతిపురం మండలం శట్టిగాని కురుబురులో కొడుకు వివాహం సందర్భంగా తల్లిదండ్రుల మధ్య తలెత్తిన గొడవ తల్లి ప్రాణం తీసింది. మునమ్మ, మురుగేశ్ దంపతులకు కూతురు కొడుకు ఉన్నారు.



 అయితే కూతురు వివాహం చేశారు ఈ దంపతులు.. గత కొంత కాలం నుంచి వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. పంచాయితీ వరకు కూడా వీరి గొడవలు వెళ్లాయి. పంచాయతీ పెద్దలు ఎంత సార్లు చెప్పిన తీరులో మాత్రం మార్పు రాలేదు. కొడుకు వివాహం లో మనమ్మ, మురుగేష్ మధ్య చిన్నపాటి మనస్పర్థల తో గొడవ జరిగింది. కోపం పట్టలేకపోయిన  మురుగేష్ కత్తితో భార్య గొంతు కోసి హతమార్చాడు.  వెంటనే స్పందించిన కొడుకు తల్లిని ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించగా మార్గమధ్యంలో ప్రాణాలు వదిలింది. ఆ తర్వాత మురుగేష్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: