ఇటీవల కాలంలో మనుషుల్లో మానవత్వం అనేది పూర్తిగా కనుమరుగైపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే మానవత్వంతో సాటి మనుషుల పట్ల జాలి దయ చూపించాల్సిన మనసులు ఉన్మాదులుగా మారిపోతున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా ఉలిక్కిపడేలా చేస్తూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా చాక్లెట్ తిన్నంత ఈజీగా మనుషుల ప్రాణాలను దారుణంగా గాల్లో కలిపేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 సాధారణంగా మనుషులు అన్న తర్వాత ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే కొంతమంది ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు ఇతరుల దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దీనికిగాను వడ్డీ చెల్లిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా అప్పు తీసుకొని చెల్లింపు విషయంలో ఆలస్యమైన సమయంలో అప్పు ఇచ్చిన వారు దారుణంగా వ్యవహరిస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఇక్కడ ఏకంగా అప్పు తీసుకోవడమే మహిళా ప్రాణాలు పోయేందుకు దారితీసింది అని చెప్పాలి. తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో దారుణంగా హత్య చేసారు ఇద్దరు దుండగులు.


 ఈ ఘటన బీహార్లో వెలుగు చూసింది అని చెప్పాలి. అప్పు తిరిగి చెల్లించలేదంటూ ఇద్దరు దుండగులు ఓ మహిళ అవయవాలను దారుణంగా నరికేశారు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు కోల్పోయింది ఆ మహిళ. నీలం దేవి తన కుమార్తె వివాహం కోసం కొంత డబ్బులు షకీల్ అనే వ్యక్తి దగ్గర అప్పుగా తీసుకోగా.. తిరిగి చెల్లించలేకపోయింది. దీంతో కోపోద్రిక్తుడిగా మారిపోయిన షఖిల్ తన సహచరుడు జోడిన్ మియాన్ తో కలిసి నీలం దేవిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: