కానీ కొంతమంది మాత్రం చిల్లర దొంగతనాలు చేసి అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారూ అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా వార్తలు వెలుగులోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ షాక్ అవుతూ ఉంటారు. కృష్ణాజిల్లా ఉయ్యూరులో కూడా ఇలాంటి తరహా జరిగింది. సాధారణంగా దొంగతనం చేయాలి అనుకునే వ్యక్తులు కాస్త రిస్క్ అయిన పర్వాలేదు విలువైన వస్తువులను ఎత్తుకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా చీప్ గా పూల మొక్కలను దొంగలించారు ఇద్దరు దంపతులు. ఇక ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. స్కూటీ పై వచ్చిన దంపతులు ఓ స్కానింగ్ సెంటర్ ప్రాంగణంలో గులాబీ మొక్కలను దొంగలించారు.
సాధారణంగా చోరీ చేయడానికి వచ్చిన దొంగలు ముందు వెనక అన్ని గమనిస్తూ ఎంతో అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇక్కడ పూల మొక్కలు దొంగతనం చేయడానికి వచ్చిన దంపతులు మాత్రం అక్కడ సీసీ కెమెరా ఉంది అన్న విషయాన్ని గ్రహించలేదు. దీంతో వారి చిల్లర దొంగతనానికి సంబంధించిన ఫోటో సీసీ కెమెరాలో రికార్డు అయింది పట్టణంలోని కాటూరు రోడ్డులో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ బయట చోరీ జరిగింది అని చెప్పాలి. ఇక ఇది చూసి మరీ పూల కుండీలు దొంగతనం చేయడం ఏంటి.. దారుణం కాకపోతే అంటూ ఎంతో మంది నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి.